Sunday, May 19, 2024

ఏపీలో కొత్త‌గా 5879 క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త ప‌ది రోజుల క్రితం రోజుకు 10వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు కరోనా కేసులు సగానికి సగం తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 5,879 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,76,370 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,615 మంది మరణించారు. ఈరోజు కూడా అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే పరీక్షల సంఖ్య తక్కువగా ఉంది. కేవలం 25,284 మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,51,238 గా ఉంది. 1,10,517 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,24,70,712 నమూనాలను పరీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement