Saturday, May 4, 2024

40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానం.. ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వాల‌ ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తుచేశారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని వివరించారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ… తెలుగుదేశం అని గుర్తు చేసుకున్నారు. టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని లీడ‌ర్ల‌కు నిర్దేశించారు. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement