Monday, May 6, 2024

రాష్ట్రంలో 30 కరోనా కేసులు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 10,529 శాంపిల్స్‌ను పరిశీలించగా 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 51 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అనంతపురంలో 4, ఈస్ట్‌ గోదావరిలో 7, గుంటూరు 1, కర్నూలు 1, నెల్లూరు 2, ప్రకాశం 1, , శ్రీకాకుళం 0, విశాఖపట్నం 7, విజయనగరం 1, వెస్ట్‌ గోదావరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్ల 33 లక్షల 50 వేల 309 శాంపిల్స్‌ను పరిశీలించగా 23 లక్షల 19 వేల 297 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23 లక్షల 04 వేల 082 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 485కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement