Thursday, April 25, 2024

గత ఎన్నికల్లో 151.. ఈసారి వైనాట్ 175 : సీఎం జగన్

గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి.. ఈసారి వైనాట్ 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… ఈసారి 175సీట్లకు 175 మనకు రావాల్సిందేనన్నారు. అంత బాగా పనిచేస్తున్నామన్నారు. గ్లాస్ లో 75శాతం నీళ్లున్నా గ్లాస్ లో నీళ్లే లేవని ప్రచారం చేస్తున్నారన్నారు. గతానికీ ఇప్పటికీ బడ్జెట్ లో చాలా తేడా ఉందన్నారు.

గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు అప్పులు తక్కువే చేశామన్నారు. మరి గతంలో ఎందుకు మంచి పనులు చేయలేదని అన్నారు. కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయన్నారు. మనకు ఓటు వేయని వారికీ మంచే చేస్తున్నామన్నారు. పులివెందులలో బస్టాండ్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని గతంలో చంద్రబాబు చెప్పారన్నారు. ఇక్కడ పనులు జరుగుతున్నాయని తెలిసి కావాలనే విమర్శలు చేశారన్నారు. రూ.3లక్షల కోట్ల సాయాన్ని ఈ మూడేళ్లలో చేశామని సీఎం జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement