Monday, April 29, 2024

పంచాయతీరాజ్‌ రోడ్ల రిపేర్ల‌కు 1,072 కోట్లు మంజూరు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలోని 9వేల 222 కి.మీ.ల పొడవైన పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతులకు సంబంధించి రూ. 1,072 కోట్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి బి.ముత్యాలనాయుడు వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలో టెడర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖామాత్యులుగా బూడి ముత్యాలనాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిషత్‌లను ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగించేందుకు సంబంధించిన దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని అన్ని విధాలా మెరుగుపర్చేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement