Thursday, May 2, 2024

TS : వెలిచాలకు భీఫాం అందించిన సీఎం రేవంత్ రెడ్డి

కరీంనగర్, ప్ర‌భ‌న్యూస్ః కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి భీఫాం అందజేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు, పార్లమెంట్ అభ్యర్థి మర్యాదపూర్వకంగా కలిసి టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

కచ్చితంగా కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మంత్రి పొన్నం సీఎంకు భ‌రోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement