Thursday, May 16, 2024

TS – తండ్రిని కాపాడబోయి గోదావరిలో పడి కుమార్తె మృతి

మంగపేట, ( ప్రభ న్యూస్ ) : గోదావరిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి ప్రమాద వశాత్తు గోదావరిలో పడి కుమార్తె మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.

- Advertisement -

ఇందుకు సంబందించి స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపురంలోని ఆటో స్టాండ్ ఏరియాకు చెందిన తాటిపల్లి రాజేందర్ తన చిన్న కుమార్తె తాటిపల్లి నిఖిత (13)తో కలిసి సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరికి వెళ్ళారు. గోదావరిలో స్నానం చేయడం కోసం తన మోబైల్ ను గోదావరి ఒడ్డున ఉన్న కుమార్తె నిఖితకు ఇచ్చి గోదావరిలో దిగి స్నానం చేస్తున్నాడు.ఈ క్రమంలో తాటిపల్లి రాజేందర్ గోదావరి నీటిలో మునిగి పోవడం గమనించిన ఒడ్డున ఉన్నర నిఖిత తండ్రిని కాపాడేందుకు తండ్రికి చెయ్యి అందిచబోయి గోదావరిలో పడి పోయింది.

దీంతో ఒడ్డుకు చేరుకున్న తండ్రి రాజేందర్ తో పాటు అక్కడకి కొంత దూరంలో ఉన్న జాలర్లు బాలికను కాపాడేందుకు ప్రయత్నం చేసి గోదావరిలో వెదకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గోదావరిలో ఉన్న బండల మద్య ఇరుక్కుపోయిన నిఖిత లభ్యమవగా బయటకు తీశారు. కాగా అప్పటికే నిఖిత మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement