Friday, May 17, 2024

రైల్ కోచ్ లో యువ‌తి మృత‌దేహాం..ఈ ఘ‌ట‌న‌ని సీరియ‌స్ గా తీసుకున్న ప్ర‌భుత్వం..

మ‌హిళ‌ల‌పై రోజు రోజుకి ఆకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఓ ప‌క్క శిక్ష‌లు ప‌డుతున్నా ఆవేమి ప‌ట్టించుకోవ‌డం లేదు దుండ‌గులు. కాగా ఓ అమానుష సంఘ‌ట‌న గుజ‌రాత్ లో చోటు చేసుకుంది. రైలు కోచ్ లో 18ఏళ్ల యువ‌తి మృత‌దేహాన్ని స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. ఆఫీస్ నుంచి హాస్టల్ కు తిరిగి వస్తుండగా యువతి వడదరలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ‌డ‌ద‌ర‌లోని ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసిన కాలేజీ విద్యార్థిని మృతదేహం నవంబర్ 4న వల్సాద్ లోని గుజరాత్ క్వీన్ ఎక్స్ ప్రెస్ కోచ్ లో వేలాడుతూ కనిపించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి క్రైమ్ అండ్ రైల్వేస్) సుభాష్ విలేకరులకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement