Wednesday, May 15, 2024

Exclusive – లోక్​సభ బరిలో కేటీఆర్​..మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ

2018 ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో మాత్రం 9 స్థానాలకే పరిమితమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 లోక్‌‌సభ స్థానాల పరిధిలోనే ఆధిక్యం సాధించింది. ఇందులో మూడింటిలో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, నాలుగు స్థానాల్లో మాత్రమే కాస్తంత ఎక్కువ ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఆరింటిని గెలుచుకుంది. మల్కాజిగిరి పరిధిలోని ఏడు స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో అయితే మల్కాజిగిరి, లేదంటే సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement