Thursday, April 25, 2024

Breaking : సీఎం జ‌గ‌న్ ని కలిసిన స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి

అమరావతి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు విశాఖ శ్రీ శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి. జ‌గ‌న్ నివాసంలో ఆయ‌న క‌లిశారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేసారు. అనంత‌రం వేద ఆశీర్వచనాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ,సీఎం జ‌గ‌న్ కి ఇచ్చారు. కాగా ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు ముఖ్యమంత్రిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి క‌లిశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement