Friday, April 26, 2024

వాౖమన్‌ రావు దంపతులది ప్రభుత్వ హత్యే: దాసోజు శ్రవణ్‌

వామన్‌ రావు దంపతుల హత్య ప్రభుత్వ హత్యేనన్నారు ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌. సుప్రీంకోర్టులో వామన్‌రావుపై తెలంగాణ ప్రభుత్వమే కేసు వేసిందని… ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడ్వకేట్‌లతో కేటీఆర్‌ మాట్లాడారన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదని కేటీఆర్‌ ఒప్పుకున్నారని విమర్శించారు దాసోజు శ్రవణ్‌. లక్ష తొంబై వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. అధికారంలో ఉన్న ఏడు సంవత్సరాలు విద్యా, వైద్యం, ఉపాధి రంగాలను పక్కన పెట్టి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చసి ఉంటే కార్పోరేట్‌ విద్యావ్యవస్థల ఆగడాలు తగ్గేవని శ్రవణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement