Sunday, April 28, 2024

ఛలో ముంబై..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముంబైకి మకాం మార్చనున్నారట.  అందుకే అక్కడ భారీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారట. ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారట ప్రభాస్. పైగా ఈయన చేసే సినిమాలన్నీ ముంబై నేపథ్యంలోనే సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్‌తో సలార్ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే సాగనుంది. కేజీయఫ్ లాంటి సినిమా తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా ఇది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ కూడా పూర్తిగా ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్ జరగనుంది. దీనికోసం రూ.300 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ సినిమా కూడా పాన్ ఇండియన్ సబ్జెక్టే. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు ప్రభాస్. ఇండియాలో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరో కూడా ఈయనే. ఈ సినిమాల కోసం కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉండబోతున్నారట ప్రభాస్. గతంలో మాదిరి హైదరాబాద్‌లో ఉండటం సాధ్యం కాదు. అందుకే అక్కడ భారీగా ఖర్చు చేసి ఇల్లు తీసుకుంటున్నారట ప్రభాస్. ఈ బాధ్యతను కూడా ఆదిపురుష్ నిర్మాత‌ల్లో ఒక‌రైన భూషణ్ కుమార్‌కు అప్పగించినట్లు తెలుస్తుంది. ఓ ఖ‌రీదైన ప్రాంతంలో రూ.50 కోట్లతో ఇల్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రభాస్ పూర్తిగా కేరాఫ్ ముంబై అయిపోతున్నాడు. తన అడ్రస్ మార్చేసుకుంటున్నాడు ఇప్పుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement