వైఎస్ఆర్టీపీ కీలక నాయకురాలు ఇందిరాశోభన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆపార్టీ నేతలు ఆమెను సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇందిరాశోభన్కు ఫోన్ చేసి మాట్లాడారు. సుమారు అర గంటకుపైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత పరంగా ఎలాంటి లోటు ఉండదని ఇందిరాశోభన్కు షర్మిల హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాననని ఇందిరాశోభన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రజాజీవితంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
ఇది కూడా చదవండిః వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. వైఎస్ఆర్టీపీకి ఇందిరాశోభన్ రాజీనామా