Friday, May 3, 2024

వైఎస్ షర్మిల అరెస్ట్.. పీఎస్ కి తరలింపు

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రతి మంగళవారం ఆమె చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలో భాగంగా నేడు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద చేపట్టిన షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.  దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. పోలీసులు అనుమతి నిరాకరించినా.. బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత షర్మిల మేడిపల్లి పీఎస్‌కు వెళ్లగా… అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో షర్మిలతోపాటు ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో మేడిపల్లి పీఎస్‌కు వైఎస్సార్టీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement