Saturday, April 20, 2024

విక్స్ డ‌బ్బా మింగి పసికందు మృతి

నల్గొండ జిల్లా నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం తొండ్లాయి గ్రామంలో విషాదం నెల‌కొంది. ఓ ఏడు నెల‌ల ప‌సికందు ఆడుకుంటూ.. త‌న ముందున్న‌ విక్స్ డ‌బ్బాను మింగేశాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై ఆస్ప‌త్రికి తీసుకెళ్తుండ‌గా ఊపిరాడ‌క దారిలోనే ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో చిన్నారి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement