Thursday, May 2, 2024

అక్కగా చెబుతున్నా..నిరుద్యోగులారా ఆత్మహత్యలొద్దు: షర్మిల

తెలంగాణలో సమస్యలపై గళం విప్పుతున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశంపై ఆమే తన వాడిని వినిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో నిరుద్యోగుల కోసం దీక్ష చేసింది షర్మిల. నిన్న నల్గోండ జిల్లాలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడడం ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. మీ అక్కగా చెబుతున్నా… దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని సందేశం అందించారు. రేపటి భవిష్యత్ కోసం ఇవాళ మార్పు తేవాలని, ఆ మార్పు కోసం అందరం కలిసికట్టుగా పోరాడదాం అని నిరుద్యోగుల్లో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం తాను ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు షర్మిల. నిన్న నల్గొండ జిల్లాలో శ్రీకాంత్ అనే పీజీ విద్యార్థి ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్త క్లిప్పింగ్ ను ట్విట్టర్ లో పంచుకున్న షర్మిల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement