Thursday, May 2, 2024

అయినవాళ్లే కాటు వేస్తే…ఇంకా దిక్కెవరు

తల్లిదండ్రులు లేని ఓ యువతిపై సొంత బాబాయే అత్యాచారం చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా జరిగింది. వావి వరసలు మరిచి సొంతవారే లైంగికంగా వేధించడంతో బాధిత యువతి(23) ఆత్మహత్యకు పాల్పడింది. సొంత బాబాయ్, పెదనాన్న కొడుకు కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో బాధితురాలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరేడుచర్ల మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే ఉండగానే చనిపోయారు. దీంతో పెద్దమ్మాయిని ఆమె పెదనాన్న చేరదీయగా.. చిన్న కూతురిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెను పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించారు.

ఇదిలా ఉంటే.. పెద్దమ్మాయి పెదనాన్న కుటుంబంతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె సొంత బాబాయి భార్యకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె ట్రైనింగ్ కు వెళ్ళింది.  అదే సమయంలో యువతి బాబాయికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో బాబాయిని చూసుకునేందుకు ఆమెను కుటుంబసభ్యులు వెళ్లమన్నారు. అప్పటి నుంచి ఆ యువతి తన బాబాయికి సేవలు చేస్తూ వస్తోంది. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భవతి అయిన యువతిని.. పెదనాన్న కొడుకు కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. మూడు రోజులుగా తీవ్ర మనస్థాపంతో భోజనం చేయడం మానేసిన బాధిత యువతి జీవితంపై విరక్తి చెంది తనువు చాలించింది. తన చెల్లెలిని బంధువులే లైంగికంగా వేధిండంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను కోల్పోయిన యువతి పల్ల అయినవారే ఇలా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండిః ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement