Friday, April 19, 2024

సామాన్యుడిపై బండ.. వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల పెంపు

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల నానా తంటాలు పడుతున్న సామాన్యుడిపై మారోసారి పిడుగు పడింది. దేశంలో వంట గ్యాస్ ధరను 25 రూపాయల మేరకు పెరిగాయి.పెట్రోల్ డీజల్ ధరల పెరుగుదల ప్రభావంతో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. దేశంలో ఇప్ప‌టికే కొన్ని నెల‌లుగా ప‌లుసార్లు వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగిన విష‌యం తెలిసిందే. తాజాగా మరోసారి సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. ఈ ధరలు నిన్న‌టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబైలో సిలిండర్ ధర రూ.859.50కు చేరుకుంది. అలాగే, కోల్‌కతాలో రూ.886గా ఉంది. గ‌త నెల 1వ తేదీన కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన విష‌యం తెలిసిందే. ఇక అటు నిత్యవసరాల ధరలు కూడా పెరిగిపోతుండటంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇది కూడా చదవండి: యూపీ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటం..!

Advertisement

తాజా వార్తలు

Advertisement