Monday, April 29, 2024

యాద‌వుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి.. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

నిజామాబాద్ సిటీ (ప్రభ న్యూస్) : యాదవులను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని.. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని అఖిల భారత యాదవ మహాసభ నిజా మాబాద్ జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల యాదవ్ హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మంత్రి తలసాని పై.. పేడ‌ పిసుక్కునే టోడివి…బర్రె లు కాసే తొడివి…అంటు….. యాదవకులాన్ని కించపరిచేలా అవమానపరిచేలా…. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ యాదవ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన వెలువెత్తాయి. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అఖిల భారత యాదవ మహాసభ నిజా మాబాద్ జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల యాదవ్ అధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి యాదవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేశారు.

ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహా సభ నిజామాబాద్ జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల యాదవ్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి గొప్ప హోదా లో ఉండి కూడా… ఎప్పుడే ఏం మాట్లాడుతున్నాడో.. సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి చెప్పే హోదాలో.ఉండి ఒకరికి చెప్పేలా ఉన్న మీరు…. మీరే తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నిం చారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమని… కానీ కులాన్ని సంబోధిస్తూ యాదవ జాతిని అవమానించేలా నీచంగా మాట్లాడడం సరికాదని హెచ్చ రించారు.ఒక్క తెలంగాణ లో నే కాకుండా యావత్ భారత దేశంలో యాదవుల సైన్యం అధికంగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా సరే యాదవ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కోరుకునేది లేదని హెచ్చరిం చారు. యాదవ కులాన్ని కించపరిచేలాగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. .ఈ కార్యక్రమంలో జగన్ యాదవ్ వెంకట్ యాదవ్ మల్లేష్ యాదవ్ యాదగిరి రాజేశ్వర్ ఆశన్న, పద్మ విజయ, లావణ్య, నిత్య రజిత రజిత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement