Friday, March 29, 2024

సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఎలుగుబంటి కలకలం చెలరేగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలుగుబంటి బయటకు వచ్చి ఎక్కడ ప్రజలపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement