Saturday, May 4, 2024

Yadagirigutta – శ్రీరామ అలంకారంలో నార‌సింహుడు

ప్రభన్యూస్ / యాదాద్రి – తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా కొనసాగుతున్నాయి…ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ సుగంధ రకాల పుష్పలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన నేడు నారసింహుడు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన పై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వజ్రవైడూర్యాలు, వివిధ రకాల సుగంధ విరజిల్లే పుష్పాలతో నయనమనోహరంగా అలంకరించారు. అర్చకులు, వేద పండితులు, వేదమంత్రాలు, వేదపారాయణ లు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నేటి రాత్రి స్వామివారికి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. కాగా, గుట్టలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనానికి గంటా 30 నిమిషాలు, రూ.150 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతున్నది.

ఈ బ్ర‌హ్మ‌త్స‌వాల కార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కరరావు, డిఇఓ దోర్బాల భాస్కర్, ఏఈవోలు రామ్మోహన్, జూసెట్టి కృష్ణ,రమేష్ బాబు, శ్రవణ్ కుమార్, రఘు, ఆలయ సిబ్బంది , భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement