Thursday, May 2, 2024

Yadadri – మురళి కృష్ణుడిగా న‌ర్స‌న్న ద‌ర్శ‌నం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్ర‌వారం యాదగిరీశుడు మురళి కృష్ణుడి (శ్రీ కృష్ణాలంకారం) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7 గంటలకు పొన్నవాహన అలంకార సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పొన్నవాహనంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతారు. కాగా, ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. ఉచిత దర్శనాని 1 గంట 30 నిమిషాల సమయం పడుతోంది. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హంసవాహనంలో ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement