Monday, April 29, 2024

కాంగ్రెస్ కి షాక్ – బీఆర్‌ఎస్‌లో చేరిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్ బీఆర్‌ఎస్‌ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ రాజకీయం కోసం కాదు.. ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్భవించిన పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. గతంలో ఎంతోమంది చాలా పెద్దలు ఉద్యమంలో పని చేశారని, ఎందరో త్యాగాలు చేశారన్నారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా.. మళ్లీ స్టార్ట్‌ చేసి కొట్లాడామని, ఇదంతా కండ్ల ముందు జరిగిన చరిత్ర అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement