Thursday, May 2, 2024

జున్నులో పురుగులు… స్వదేశీ రెస్టారెంట్ పై కస్టమర్ల ఆగ్రహం

మేడిపల్లి, జులై 15 (ప్రభ న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ హైవే రోడ్డు పిల్లర్ నంబర్ 55 డెకత్లాన్ ఎదురుంగా స్వదేశీ హోటల్ లో కుటుంబ సమేతంగా తినడానికి వస్తే అనుకోకుండా జున్ను ఆర్డర్ ఇచ్చారు. తింటుంటే అందులో ఒక పురుగు, బూజు కనిపించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలువురు కస్టమర్ ల సహాయంతో యజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశ్నిస్తే… మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా చెబుతున్నారు. మీడియా రంగ ప్రవేశంతో చివరికి దిగివచ్చి యాజమాన్యం సిబ్బంది మాట్లాడుతూ.. ఈ ఒక్కసారి క్షమించండి….చూసి చూడనట్టు ఉండండి అంటూ సిబ్బంది కస్టమర్ ను ఒత్తిడి పెట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement