Monday, April 29, 2024

Suicide – ప్రేమ పెళ్ళికి పేరెంట్స్ నో – కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకేసిన యువతి

హైదరాబాద్ : మాదాపుర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జి పై నడుస్తూ ఒక్కసారిగా పై నుండి దుర్గం చెరువులోకి దూకేసింది.

యువతిని ఆమె స్నేహితురాలు అపే ప్రయత్నం చేసినా వినకుండా బ్రిడ్జి పై నుంచి దూకేసింది. పోలీసులకు యువతి స్నేహితురాలు సమాచారం అందించింది. యువతి కోసం దుర్గం చెరువులో లేక్ పోలీసులు గాలిస్తున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకిన యువతి పేరు పాయల్ (17)గా గుర్తించారు.అమె స్వస్థలం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా. ఉద్యోగం కోసం హైదరాబాద్ కు నాలుగు నెలల క్రితం పాయల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. యువతి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement