Monday, May 6, 2024

భార్య‌ను హ‌త్య చేసి… ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త

కరీంనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం మార్కండేయ కాలనీలో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసి అనంతరం భర్త ఉరి వేసుకుని ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కరీంనగర్ : మార్కెండయ్య కాలనీ లో నివాస‌ముంటున్న భార్య వేముల లావణ్య (42)ను భర్త వేముల ప్రవీణ్ (50) హ‌త్య చేశాడు.. ఈ హ‌త్య చేసి రెండు రోజులైంది.. అయితే ఎవ‌రికీ తెలీయ‌కుండా భార్య‌ మృతదేహాన్ని ఇంటిలోనే దాచి ఉంచాడు.. ఆదివారం నాడు హ‌స్ట‌ల్ ఉండి చ‌దువుకుంటున్న‌న కుమార్తెను చూసి నేటి ఉద‌యం ఇంటికి వ‌చ్చాడు.. ఆ త‌ర్వాత అత‌డు ఉరి వేసుకుని చ‌నిపోయాడు .. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement