Sunday, April 28, 2024

TS: భర్త చేతిలో భార్య హతం.. రంగాపూర్ లో ఘటన

మూడు ముళ్ళు వేసి కలకాలం తోడుంటానని వివాహమాడిన భర్త చేతిలోనే భార్య హతమైన సంఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కలబోయిన కౌసల్యను ఆమె భర్త కొమురయ్య హతమార్చాడు.

సమాచారం అందుకున్న బసంతనగర్ ఎస్ఐ స్వామి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల వల్లే హత్య జరిగినట్లు గ్రామస్తులు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement