Thursday, May 2, 2024

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిచి కెసిఆర్ కి గిఫ్ట్ గా ఇస్తాం – మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట : ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇస్తాం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.. సూర్యాపేటలో ఎమ్మెల్యే కిశోర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ,. తెలంగాణలో మూడోసారి కూడా గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా కు సకలజనుల ఆమోదం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, తిరిగి కేసీఆరే మూడోసారి సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదన్న మంత్రి.. ప్రతిపక్షాలవి చిల్లర ప్రగల్భాలు, వారు చేసే వ్యాఖ్యలు అర్థరహితం అని ఆరోపించారు.

75 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీలే అన్న మంత్రి, వారు చేయాలేని అభివృద్ధి ని 10 ఏళ్లలోనే కేసీఆర్ చేసి చూపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనను క్యాష్ చేసుకోవాలని ఆశపడిన ప్రతిపక్షాల ఆశలు అడియాశలు అయ్యాయని, కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement