Tuesday, April 30, 2024

TS : లెండి ప్రాజెక్టుపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం… ప్రొ.కోదండరాం

అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయినటువంటి లెండి ప్రాజెక్ట్ పనులపై ప్రభుత్వానికి నివేదిక అందించి జుక్కల్ నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి సాగునీరందించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని వాజిద్ నగర్ గ్రామాన్ని సందర్శించి తన చిన్ననాటి స్నేహితులతో క‌లిసి చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకుని గ్రామ రైతాంగంతో చర్చించారు.

వాజిద్ నగర్ గ్రామం కూరగాయల పంటకు ఈ ప్రాంతంలో పెట్టింది పేరుగా ఉందని, కూరగాయలు పండించే రైతాంగంకు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కోదండరాం రైతులకు హామీ ఇచ్చారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయినటువంటి లెండి ప్రాజెక్టు పనులు కొన్నేళ్లు గడుస్తున్నా.. పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలోని మదనూర్, జుక్కల్ మండలంలో కాలువలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement