Sunday, April 28, 2024

TS: రైతన్నకు అండగా ఉంటాం.. మాజీ సీఎం కేసీఆర్

.. ధైర్యంగా ఉండండి..
.. ప్రభుత్వంపై పోరాడుదాం

వంట నష్టపోయిన రైతాంగానికి కష్టకాలంలో బిఆర్ఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్ లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కళ్ళముందే పంట ఎండిపోతుందని వాపోయిన రైతులను ఓదార్చారు. రైతన్నలకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితి తెలంగాణలో వస్తుందని ఊహించలేదన్నారు.

అన్నం పెట్టే అన్నదాతలకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ధైర్యంగా ఉండండి సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వంపై పోరాడుదాం అని రైతులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ విప్ బాల్క సుమన్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు బారాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement