Wednesday, May 15, 2024

Breaking | అందుబాటులో ఉండి సేవలందిస్తాం.. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

జిల్లా ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జీవి. శ్యాం ప్రసాద్ లాల్ తెలియజేశారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

పెద్దపల్లి తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజలు పెద్ద మనసు గల వారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన శ్యాంప్రసాద్ లాల్ కు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement