Monday, April 29, 2024

Siddipet: యోగాను మన జీవనవిధానంగా మార్చుకోవాలి.. హరీశ్ రావు

యోగాను మన జీవనవిధానంగా మార్చుకోవాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… యోగాతో అన్నిరకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పెరుగుతున్నాయని, ఆరోగ్యం కాపాడుకోవాలని, ఆరోగ్యం కోసం యోగ చేయాలన్నారు. ఖర్చు లేని పని యోగ సాధన చేయడమన్నారు.

అందరం ఎంతో బిజీగా ఉన్నామని, ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు యోగాసనాలు ప్రాణాయామమని, నేర్పిస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలో యోగాను ఒక భాగంగా చేశామన్నారు. పిల్లలకు యోగ కాన్సంట్రేషన్ పెంచుతుందన్నారు. మన యోగ ప్రపంచ దేశాలలో చేస్తున్నారన్నారు. ప్రపంచం యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందిందన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే గొప్ప వైద్య సేవలు అందించడం కాదు.. రోగం రాకుండా కాపాడుకోవడమన్నారు.


7.4 గ్రీన్ కవర్ తో దేశంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని స్థాయిలలో అమలుచేస్తున్నరన్నారు. క్యాన్సర్ పేషంట్స్ బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ వారు ఆ వ్యాధిని అధిగమిస్తున్నారన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత ఊరికే రాలేదు…. ఆరోగ్యం కాపాడుకోవాలి.. లేకపోతే బీపీ, సుగర్ లాంటి వ్యాధులు మనిషిని క్రమంగా పాడుచేస్తుందన్నారు. ప్రతీ మనిషి ఇంకో పది మందికి యోగ చేపించాలన్నారు. సిద్దిపేట అనేక రంగాల్లో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని, ఆరోగ్యంలో కూడా మనం ముందుండాలన్నారు. ప్రతీ లీడర్ తమ తమ గల్లీలో యోగ చేయించాలని, చేసే ప్రతి వ్యక్తికి మ్యాట్ ఇస్తామన్నారు. అందరం కలిసి ఆరోగ్య సిద్దిపేటగా మార్చాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement