Sunday, April 28, 2024

ఎమ్మెల్యేగా నాయక్ వద్దు.. కొత్త వ్యక్తే ముద్దు

కేసముద్రం, జులై 13(ప్రభ న్యూస్) : ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్దు బారసా కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తేనే ముద్దు అని కేసముద్రం పట్టణ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం విలేజ్ లోని మాజీ సర్పంచ్ సట్ల నర్సయ్య ఇంటి ఆవరణలో మండల ఉద్యమకారులతో బట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేక వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఉద్యమ కారులను కానీ, నిజమైన కార్యకర్తలను కానీ పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీ క్యాడర్ ను, ఉద్యమకారులను పట్టించు కోలేదన్నారు.

కొంతమంది పార్టీ వ్యక్తులను అందలం ఎక్కిస్తూ వారు చేస్తున్న చీకటి అక్రమ దందాలకు అండగా ఉంటున్నాడని ఆరోపించారు. ఇటువంటి ఎమ్మెల్యేకు మళ్ళీ టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని, బారాసా తరుపున కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని, గెలుపు కోసం పనిచేస్తామని ఈసందర్బంగా సర్పంచ్ పేర్కొన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించొద్దని హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ సట్ల నర్సయ్య, వార్డు సభ్యులు తుంపిల్ల వెంకన్న, పోలేపల్లి చెన్నారెడ్డి, సంకపల్లి శ్రీనివాస్ రెడ్డి, కంపటి మహేందర్, కొలిపాక బాబు, కముటం స్వామి, గదాగోని వీరన్న, జల్లె శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement