Tuesday, May 7, 2024

Warning – రేష‌న్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు … మిల్ల‌ర్ల‌కు ఉత్త‌మ్ వార్నింగ్

హుజూర్ న‌గ‌ర్ : రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ న‌గ‌ర్ లోని షన్ దుకాణాలను నేడు తనిఖీ చేసిన ఆయన.. మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించిన తర్వాత ఉత్తమ్కుమార్రెడ్డి రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు 5 కేజీలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కేజీ బియ్యం అందుతున్నాయని తెలిపారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 6 కేజీల బియ్యాన్ని అందిస్తుందని వివరించారు. తెలంగాణాలో 89 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత, ఇతర అంశాలపై రేషన్ డీలర్లతో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చర్చించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మొత్తం సేకరణ ఖర్చు కిలోకు రూ. 39 అని అన్నారు. అయితే, దాదాపు 70-నుంచి 75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుందన్నారు. బియ్యం రీసైక్లింగ్లో ప్రమేయం ఉన్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఉత్తమ్. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు లేదా ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement