Monday, April 29, 2024

డెంగ్యూ జ్వ‌రంతో మ‌హిళ మృతి

వాజేడు : డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన పంది వెంకటమ్మ 45 సంవత్సరాలు అనే మహిళకు గత మూడు రోజులుగా జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీలను ఆశ్రయించారు ఆరోగ్యం నయం కాకపోగా మరింతగా విషమించడంతో ఏటూరునాగారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందినప్పటికీ ఆరోగ్యం నయం కాకపోగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో అక్కడి నుండి భద్రాచలం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యం పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అక్కడి వైద్యులు డెంగ్యూ జ్వరం రావడం, ప్లేట్లెట్స్ పడిపోవడంతో జాండిల్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబీకులు పేర్కొన్నారు. వాజేడు మండలంలో రోజురోజుకు డెంగ్యూ జరాల మరణాలు పెరిగిపోవడంతో మండల వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement