Sunday, April 28, 2024

TS: హ్యాట్రిక్ విజయం సాధిస్తాం…100 సీట్లకు పైగా గెలుస్తాం.. దాస్యం వినయ్ భాస్కర్

బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో 100 సీట్లకు పైగా గెలుస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ బట్టుపల్లిలో నిర్వహించే ప్రజా దీవెనసభ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ… అనేక సభలు నిర్వహించి,10ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. 80 వేల మందితో ప్రజా దీవెన సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పథకాల గురించి విమర్శించే అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేవన్నారు. పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహభరితంగా పనిచేయడం జరుగుతుందన్నారు.

అభివృద్ధి పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక మోడల్ గా తయారైందన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారన్నారు. గ్యారంటీ లేని వారంటీ లేని పథకాలతో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో అమలు పరిచే విషయంలో ఫెయిల్ అయిందన్నారు. అమలుకు సాధ్యం కాని పథకాలతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా చూసి వాటిని అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని, 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అందులో తాను కూడా ఒక్కడినని అధిక మెజారిటీ ఇచ్చి, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

అనంతరం సభ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, సభా వేదిక, హెలిప్యాడ్ కు సంబంధించిన స్థలాన్ని వర్ధన్న పేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మేయర్ గుండు సుధా రాణి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు లలిత యాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నాయకులు వనం రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, ప్రేమ్ సాగర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement