Tuesday, May 21, 2024

హెడ్ కానిస్టేబుల్ కి పోలీస్ కమిషనర్ నివాళి

వరంగల్ – గత రాత్రి నార్కెట్ పల్లి హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వరంగల్ ఆర్మూడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ సిరాజుద్దీన్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి నివాళులు అర్పించారు. వరంగల్ పోచమ్మమైదాన్ లోని మృతుడి స్వగృహానికి చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ హెడ్ కానిస్టేబుల్ సిరాజుద్దీన్ భౌతికాయంపై పూలు వుంచి నివాళులు అర్పించి సిరాజు కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ పరామర్శించారు. సిరాజూధ్ధీన్ కు నివాళులు ఆర్పించిన వారిలో ఆర్మూడ్ రిజర్వ అదనపు డి.సి.పి భీంరావు, వరంగల్ ఎ.సి.పి గిరికుమార్, ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పేక్టర్ వేంకటేశ్వర్లు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement