తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం చెలరేగింది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇందిరమ్మ ఇళ్లు కాజేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉన్న వాల్ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తుల పేరిట వెలిశాయి. వాల్ పోస్టర్ల నేపథ్యంలో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement