Sunday, May 5, 2024

గుర్తుతెలియని మృత దేహం లభ్యం

కేసముద్రం : కేసముద్రం మండలం రాము తండా ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గుర్తు తెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది. కాగా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్సై చిర్ర రమేష్ బాబు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్ళు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement