Wednesday, May 1, 2024

క‌మ్మేసిన పొగ‌మంచు.. బైక్-లారీ ఢీ.. ఒకరు మృతి..

రాష్ట్రంలో చ‌లితీవ్ర‌త రోజురోజుకు పెరుగుతుంది. దీనికి తోడు మంచు కూడా విప‌రీతంగా ప‌డుతుండ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. తెల్ల‌వారు జామున రోడ్ల‌ను మంచు దుప్ప‌టిక‌ప్పేయ‌డంతో రోడ్లు క‌నిపించ‌డం లేదు. దీంతో ప‌లు చోట్ల యాక్సిడెంట్లు కూడా జ‌రిగాయి. తాజాగా వరంగ‌ల్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఈ క్రమంలో ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగ మంచు ప్రభావంతో రాయపర్తి దగ్గర బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి రెండు ముక్కలై మృతి చెందాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement