Wednesday, May 1, 2024

బోటులో తిరుగుతూ.. ముంపు వాసుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ మంత్రి

కార్పొరేషన్ , (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రంలోని ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. హంటర్ రోడ్ లోని సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, సంతోష్ మాత కాలనీ ప్రాంతాల్లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బోటులో తిరుగుతూ ముంపు ప్రాంతాల వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు . ముంపు లో చిక్కుకున్న పిల్లల్ని డి.ఆర్.ఎఫ్. బృందాలతో కలిసి బోట్ లో ప్రయాణించి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మంత్రితో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement