Monday, April 29, 2024

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సుభిక్షం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హన్మకొండ : సీఎం కేసీఆర్‌ పాలనాదక్షతతో ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా విరాజిల్లుతున్నదని, తెలంగాణ మాడల్‌ పాలన తమకూ కావాలని యావత్‌ దేశం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదరులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణలో పంటలకు సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నందున దేశ వ్యాప్తంగా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌ వైపు చూస్తున్నారని వివరించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్‌ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని బిఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement