Tuesday, May 7, 2024

స్కానింగ్ కేంద్రాలపై నిఘా.. వెంకట్ నారాయణ

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న బాలాజీ స్కానింగ్ కేంద్రాన్ని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి వెంకట్ నారాయణ సీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలు ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం నిర్వహించాలని ఆయన అన్నారు.పిండ లింగ నిర్ధారణ పరీక్షలు కానీ, అబార్షన్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఆసుపత్రి పై నిఘా ఉందని ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయని అన్నారు.జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ ప్రకాశ్,డెమో అనిల్,మండల వైద్యాధికారి అరుణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement