Friday, May 17, 2024

సర్వోదయ మిత్రమండలి సేవలు అభినందనీయం

హనుమకొండ : సర్వోదయ మిత్రమండలి సేవలు అభినందనీయమ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు, ఆక్సీ మీటర్లు కలెక్టర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అంద‌జేశారు. స్వర్గీయ మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవస్థాపక అధ్యక్షులు, కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ సారథ్యంలో సర్వోదయ మిత్రమండలి పనిచేస్తుంది. మేడారం జాతర సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ దాదాపు రూ.30 లక్షల విలువ చేసే నాలుగువేల ఐదు వందల పీపీఈ కిట్లు, వెయ్యి ఆక్సి మీటర్లను జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సమక్షంలో అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement