Sunday, May 5, 2024

హన్మకొండ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ శివారులో చోటుచేసుకుంది. కారు – ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కమలాపూర్ మండలంలోని గోపాల్ పూర్, గుంటూరుపల్లె గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో పరకాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement