Friday, April 26, 2024

పొన్నాల వర్సెస్ కొమ్మూరి కాంగ్రెస్ జోడో యాత్రలు

జనగామ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో టిపిసిసి ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కాంగ్రెస్ నేత‌లు చేప‌ట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండ కడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్య‌క్ర‌మాల‌ను ప్రజలకు వివరిస్తున్నారు. అయితే హాత్ సే హాత్ జోడో పొన్నాల వర్గీయులు వర్సెస్ కొమ్మూరి పాదయాత్రలు జనగామ పట్టణంలోని పలు వార్డులలో పాదయాత్రలు సాగాయి. పట్టణంలోని మరో మారు కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలతో కార్యక్రమాలు సాగడంపై అయోమయానికి గురి కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంతే అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా జనగామ కాంగ్రెస్ పార్టీ వర్గం విభేదాలతో అధికార పార్టీకి లాభం చేకూరే అవకాశమే తప్ప మరేదీ కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement