Sunday, April 28, 2024

వంద క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యం పట్టివేత

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబుల గడ్డ వద్ద ఆదివారం రాత్రి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వాహనంలో రేగొండ నుండి మహారాష్ట్రకు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో జిల్లా పౌర సరఫరాల అధికారులు, పోలీసులు అర్థరాత్రి మాటు వేసి పట్టుకున్నారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. పీడీఎస్ బియ్యంతో పాటు డీసీఎం వాహనం సీజ్, డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement