Thursday, April 25, 2024

బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యం : బీజేపీ నేత విజ‌య‌శాంతి

కుత్భుల్లాపూర్: కేంద్రంలో, తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది భార‌తీయ జ‌న‌తా పార్టీ అని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. 4వ విడత బీజేపీ బహిరంగ సభ కుత్భుల్లాపూర్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా విజయ శాంతి మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యం అన్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు.. గార్బేజ్ హైదరాబాద్ లా ఉంద‌న్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా… చెత్తమయంగా క‌నిపిస్తోంద‌ని, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ను సర్వనాశనం చేశాడ‌న్నారు. హైదరాబాద్ సంధుల్లో ఎక్కడ చూసినా కచరానే దర్శనమిస్తోంద‌న్నారు. వర్షాలు వస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు వ‌స్తున్నా దోమల మందు కొట్టడం లేద‌న్నారు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నాడు అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, నాలల పరిస్థితి అద్వాన్నంగా ఉంద‌న్నారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించని కారణంగా పేదలు వైద్యానికి దూరం అవుతున్నారు. మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ అమలు చేయడం లేద‌న్నారు. తెలంగాణను సర్వనాశనం చేసి కేసీఆర్‌ దోచుకుతింటున్నాడు అన్నారు. తెలంగాణ రైతులను ఆదుకోని కేసీఆర్, పక్క రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సొమ్మును పంచుతున్నారు అన్నారు. నీలాంటి నీచుడితో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నా, ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టిస్తున్నాడు అని మండిప‌డ్డారు. కేసీఆర్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా… మోడీని ఏమీ చేయలేరు, ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement