Saturday, May 4, 2024

ఆలయంలో చోరీ..విగ్ర‌హం..క‌డియాల‌తో పాటు హుండీ మాయం..

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారీ చోరీ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో
వెండి విగ్రహం,రెండు కడియాలు,హుండీని ఎత్తుకెళ్ళారు దుండ‌గులు. సుమారుగా 2 గంటల సమయంలో ఈ చోరీ జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా అదే రోజున ముప్ప‌న‌ప‌ల్లి గ్రామంలో ఓ రైతు బైక్ ని ఎత్తుకెళ్లారని గ్రామ‌స్థులు తెలియ‌జేశారు. స్వామి వారి విగ్రహానికి ఉన్న కిరీటం,రెండు కడియాలు ఎత్తుకెళ్లారని ఆలయ అధ్యక్షుడు బుద్దె సత్యనారాయణ వివ‌రించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకొని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement