Saturday, May 4, 2024

కేసీఆర్ చిత్ర పట్టానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజ కొంటుంది అని కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై యావత్తు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రం లో రైతులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండ్ర వెంకట రమణా రెడ్డి, భూపాలపల్లి తెరాస పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్  చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement